డబ్బులు ఇవ్వలేదని దారుణం.. 27 కత్తిపోట్లు.
ఇద్దరూ పదో తరగతి విద్యార్థులే.. ఒకరు పోలీసుల అదుపులో, మరొకరు పరారీ.
నల్గొండ: కొండమల్లేపల్లి మండలం జేబీనగర్లో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె వద్ద డబ్బులు అడిగి ఇవ్వకపోవడంతో, అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
డబ్బుల కోసం ఇంట్లోకి చొరబడిన ఇద్దరు బాలురు.. రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా 27 కత్తిపోట్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు బాలుర ప్రమేయాన్ని గుర్తించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో బాలుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి