అంకిరెడ్డిగూడెంలో అవగాహన సదస్సు
మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చౌటుప్పల్ పోలీస్ అధికారులు సూచించారు. అంకిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి. నర్సిరెడ్డి పాల్గొని స్థానిక యువత, గ్రామస్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... మత్తు పదార్థాలకు బానిసలైతే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని, సమాజంలో గౌరవం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నవతరం చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, విద్య, ఉద్యోగం, క్రీడారంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి