Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 08:17 PM

డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
18-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI


అంకిరెడ్డిగూడెంలో అవగాహన సదస్సు

మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చౌటుప్పల్ పోలీస్ అధికారులు సూచించారు. అంకిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ డి. నర్సిరెడ్డి పాల్గొని స్థానిక యువత, గ్రామస్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... మత్తు పదార్థాలకు బానిసలైతే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని, సమాజంలో గౌరవం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నవతరం చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, విద్య, ఉద్యోగం, క్రీడారంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని కోరారు.

Sthanikam

డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

Article Image


అంకిరెడ్డిగూడెంలో అవగాహన సదస్సు

మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చౌటుప్పల్ పోలీస్ అధికారులు సూచించారు. అంకిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ డి. నర్సిరెడ్డి పాల్గొని స్థానిక యువత, గ్రామస్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... మత్తు పదార్థాలకు బానిసలైతే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని, సమాజంలో గౌరవం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నవతరం చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, విద్య, ఉద్యోగం, క్రీడారంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News