కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్(ఎస్) మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, శెట్టి గూడెం సర్పంచ్ రాచకొండ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 18, 2026 06:26 PM
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి
18-08-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్(ఎస్) మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, శెట్టి గూడెం సర్పంచ్ రాచకొండ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి