Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 03:59 PM

ప్రతి శిశువుకు తొలి వరం తల్లిపాలే.. కంగ్టిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం

ప్రతి శిశువుకు తొలి వరం తల్లిపాలే.. కంగ్టిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం

ప్రతి శిశువుకు తొలి వరం తల్లిపాలే.. కంగ్టిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం
05-08-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం మరియు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలనే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతాడని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం తల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటూ ప్రతి కుటుంబం బాలింతలకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి శిశువుకు తొలి వరం తల్లిపాలే.. కంగ్టిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం మరియు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలనే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతాడని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం తల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటూ ప్రతి కుటుంబం బాలింతలకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News