Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 09:41 PM

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
10-09-2026 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్ నుంచి వస్తుండగా కైతాపురం స్టేజీ వద్ద ప్రమాదం

వేగంగా వచ్చిన లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాలై ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. ​పోలీసుల కథనం ప్రకారం.. ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన బద్రి రాహుల్ (23) హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. గ్రామంలో బోనాల పండుగ ఉండటంతో తన టీవీఎస్ రైడర్ ద్విచక్రవాహనం (TG 03 BA 2595) పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో కైతాపురం స్టేజీ వద్దకు చేరుకోగానే వెనుక వైపు నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం (GJ 27 TT 7465) బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో రాహుల్ రహదారిపై పడిపోవడంతో తల వెనుక భాగంలో బలమైన తీవ్ర రక్తగాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాగేంద్ర ప్రతాప్ పటేల్‌గా గుర్తించారు. మృతుడి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Article Image

హైదరాబాద్ నుంచి వస్తుండగా కైతాపురం స్టేజీ వద్ద ప్రమాదం

వేగంగా వచ్చిన లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాలై ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. ​పోలీసుల కథనం ప్రకారం.. ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన బద్రి రాహుల్ (23) హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. గ్రామంలో బోనాల పండుగ ఉండటంతో తన టీవీఎస్ రైడర్ ద్విచక్రవాహనం (TG 03 BA 2595) పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో కైతాపురం స్టేజీ వద్దకు చేరుకోగానే వెనుక వైపు నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం (GJ 27 TT 7465) బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో రాహుల్ రహదారిపై పడిపోవడంతో తల వెనుక భాగంలో బలమైన తీవ్ర రక్తగాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాగేంద్ర ప్రతాప్ పటేల్‌గా గుర్తించారు. మృతుడి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News