Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎడ్లకు ప్రత్యేక పూజలు.. కంగ్టిలో ఘనంగా పోలా వేడుకలు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 07:37 PM

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య.. విద్యార్థులకు ఉచిత దుస్తులు, షూస్

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య.. విద్యార్థులకు ఉచిత దుస్తులు, షూస్

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య.. విద్యార్థులకు ఉచిత దుస్తులు, షూస్
10-09-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని నాగుర్-కె ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బెల్టులు, షూస్ పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మహానంద, ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానంద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. బడిఈడు వయస్సు ఉన్న ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, షూస్, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య.. విద్యార్థులకు ఉచిత దుస్తులు, షూస్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని నాగుర్-కె ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బెల్టులు, షూస్ పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మహానంద, ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానంద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. బడిఈడు వయస్సు ఉన్న ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, షూస్, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News