Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 10:35 PM

సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్
09-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా ఎస్‌ఐఆర్‌ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ కోరారు. బుధవారం మానూర్ మండలంలోని మాయికోడ్ గ్రామంలో సర్వేకు సంబంధించిన ఫారాలను పరిశీలించిన ఆమె, ఓటరు జాబితాలో పేర్లు లేదా వివరాల్లో తప్పులు ఉన్నవారు సవరణ కోసం అవసరమైన ఆధార పత్రాలను స్థానిక బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో గ్రామస్తులు బీఎల్‌ఓలకు పూర్తి సహకారం అందించి, అవసరమైన వివరాలను త్వరగా అందించాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ కర్ణం కృష్ణ మానూర్ వద్ద వాగుపై కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె కల్వర్టు నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయని, కాంట్రాక్టు ఎవరైనా ముందుకు వచ్చిన వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణుసాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ శంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, అంగన్‌వాడీ టీచర్లు కాశమ్మ, సంధ్యారాణి, గ్రామస్తులు శరణప్ప, చంద్రకాంత్, బసుగొండ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్

Article Image

గ్రామాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా ఎస్‌ఐఆర్‌ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ కోరారు. బుధవారం మానూర్ మండలంలోని మాయికోడ్ గ్రామంలో సర్వేకు సంబంధించిన ఫారాలను పరిశీలించిన ఆమె, ఓటరు జాబితాలో పేర్లు లేదా వివరాల్లో తప్పులు ఉన్నవారు సవరణ కోసం అవసరమైన ఆధార పత్రాలను స్థానిక బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో గ్రామస్తులు బీఎల్‌ఓలకు పూర్తి సహకారం అందించి, అవసరమైన వివరాలను త్వరగా అందించాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ కర్ణం కృష్ణ మానూర్ వద్ద వాగుపై కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె కల్వర్టు నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయని, కాంట్రాక్టు ఎవరైనా ముందుకు వచ్చిన వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణుసాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ శంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, అంగన్‌వాడీ టీచర్లు కాశమ్మ, సంధ్యారాణి, గ్రామస్తులు శరణప్ప, చంద్రకాంత్, బసుగొండ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News