Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్ న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 04:58 PM

విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్

విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్

విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్
09-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు.​చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం టౌన్‌లోని అరబిందో జూనియర్ కాలేజ్ సమీపంలో ‘రోడ్ సేఫ్టీ అండ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, కార్లలో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ​అలాగే, సమాజాన్ని వేధిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. యువత చదువుపై శ్రద్ధ వహించి, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నివారణలో చురుగ్గా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్

Article Image

విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు.​చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం టౌన్‌లోని అరబిందో జూనియర్ కాలేజ్ సమీపంలో ‘రోడ్ సేఫ్టీ అండ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, కార్లలో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ​అలాగే, సమాజాన్ని వేధిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. యువత చదువుపై శ్రద్ధ వహించి, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నివారణలో చురుగ్గా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News