చైతన్యపురి: గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చైతన్యపురి సీఐ సైదులు సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీని పోలీస్ స్టేషన్లో సమర్పించడంతో పాటు, ముగ్గురు కమిటీ సభ్యుల ఆధార్ కార్డు ప్రతులను జత చేయాలని తెలిపారు.
మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్లకు అనుమతి లేదని సీఐ స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా రహదారులను బ్లాక్ చేయకుండా ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ సైదులు హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి