రూ.20 వేల విలువైన ఫర్నిచర్ విరాళం.. 2008–09 బ్యాచ్ ఆదర్శం.
పేరేపల్లి:
తాము అక్షరాలు దిద్దుకున్న బడిని మరువకుండా.. చదువు నేర్పిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు చేయూతనందించారు పూర్వ విద్యార్థులు. పేరేపల్లి MPUPS పాఠశాలలో 2008–09 విద్యా సంవత్సరంలో 7వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల బృందం ‘మేము సైతం పాఠశాల అభివృద్ధికి’ అంటూ ముందుకొచ్చింది.పాఠశాల అవసరాలను గుర్తించిన వారు సుమారు రూ.20 వేల విలువైన కంప్యూటర్ టేబుల్, స్టీల్ బీరువా, 10 కుర్చీలను విరాళంగా అందజేశారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరించడం పట్ల పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉన్నత స్థాయికి ఎదిగినా చిన్ననాటి బడిని మరిచిపోకుండా సేవాభావంతో ముందుకొచ్చిన 2008–09 బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. వారి చొరవ ఇతర పూర్వ విద్యార్థులకు సైతం స్ఫూర్తిదాయకమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి