నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించాలని కోరుతూ దేగుల్వాడి గ్రామానికి చెందిన మల్లా షేక్ అహ్మద్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాత్రి వేళల్లో అత్యవసర వైద్యం అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినప్పుడు రోగులను నారాయణఖేడ్కు తరలించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా పేద, సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించి, 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందించేలా తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని తన వినతిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లా షేక్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.
కంగ్టిలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
కంగ్టిలో రాత్రివేళ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించాలని కోరుతూ దేగుల్వాడి గ్రామానికి చెందిన మల్లా షేక్ అహ్మద్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాత్రి వేళల్లో అత్యవసర వైద్యం అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినప్పుడు రోగులను నారాయణఖేడ్కు తరలించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా పేద, సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించి, 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందించేలా తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని తన వినతిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లా షేక్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి