Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:55 AM

రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి

రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి

రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి
26-08-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో రాత్రివేళ అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టి.వై.జె.ఎఫ్. జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ జలీల్ కోరారు. రాత్రి సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా బాధ్యతగా వ్యవహరించి కనీసం ఒక ఆసుపత్రి రాత్రివేళ వైద్యులు, సిబ్బందితో అందుబాటులో ఉండేలా షిఫ్ట్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు సమన్వయంతో పనిచేస్తే అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా కంగ్టి మండల కేంద్రంలోనే 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని షేక్ జలీల్ కోరారు.

Sthanikam

రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి

Article Image

కంగ్టి మండల కేంద్రంలో రాత్రివేళ అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టి.వై.జె.ఎఫ్. జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ జలీల్ కోరారు. రాత్రి సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా బాధ్యతగా వ్యవహరించి కనీసం ఒక ఆసుపత్రి రాత్రివేళ వైద్యులు, సిబ్బందితో అందుబాటులో ఉండేలా షిఫ్ట్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు సమన్వయంతో పనిచేస్తే అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా కంగ్టి మండల కేంద్రంలోనే 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని షేక్ జలీల్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News