రామన్నపేట, ఆగస్టు 26: రామన్నపేట మండలానికి గోదావరి జలాలు సాధించేందుకు సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘చలో హైదరాబాద్’ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట పట్టణ సీపీఎం జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
రామన్నపేట పట్టణం నుంచి రైతులు, యువకులు, మహిళలు, వృత్తి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గోదావరి జలాలను రామన్నపేట మండలానికి తీసుకురావాలనే డిమాండ్తో చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.
సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు భావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, గోరిగ సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, ఆముద ఆంజనేయులు, పాల్వంచ జగతయ్య, గంజి అశోక్, కడారి రాములు, చిన్నోజు బాబు చారి, యాట విష్ణు, మామిడి లింగస్వామి, బోల వెంకన్న, మాల్గ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి