Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:08 PM

మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్

మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్

మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్
25-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ పిలుపునిచ్చారు.గ్రామంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.‘‘పచ్చని గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలి’’ అని ప్రియాంక రాజేందర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్ జిపిఓ వెంకటేష్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం ఆశ వర్కర్లు అనసూయ , సుమలత గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలో మరిన్ని ప్రాంతాల్లో పచ్చదనం పెంచేలా నిరంతరం కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ తెలిపారు.

Sthanikam

మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ పిలుపునిచ్చారు.గ్రామంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.‘‘పచ్చని గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలి’’ అని ప్రియాంక రాజేందర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్ జిపిఓ వెంకటేష్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం ఆశ వర్కర్లు అనసూయ , సుమలత గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలో మరిన్ని ప్రాంతాల్లో పచ్చదనం పెంచేలా నిరంతరం కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News