మానవ జీవన విధానానికి మొక్కలే కీలకం
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం మోతే మండలం రాంపురం తండాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని, వాటిని పెంచడం ద్వారా భావితరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
అనంతరం మామిళ్లగూడెం హైస్కూల్ను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై కలెక్టర్ ప్రధానోపాధ్యాయురాలు నళినిని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమాల్లో రాంపురం సర్పంచ్ బానోతు సత్తెమ్మ, మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్ రెడ్డి, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో సందీప్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు నళిని, ఎంపీవో వంశీకృష్ణ, జర్నలిస్టులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి