మున్సిపల్ కమిషనర్కు యువ శక్తి యువజన సంఘం వినతి.
చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పాత శివనేని గూడెం రోడ్డులో ఎల్లమ్మ తల్లి దేవాలయం వెనుక ఉన్న శివసాయి వెంచర్లో 10 శాతం భూమిని పరిరక్షించి, వార్డు అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ యువ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గురు లింగంను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చింతపల్లి ప్రవీణ్, మద్ది మధు మాట్లాడుతూ.. వెంచర్లో నిబంధనల ప్రకారం 10 శాతం భూమి ఉందా? ఉంటే అది ఎక్కడ ఉందో స్పష్టం చేయాలని కోరారు. 10 శాతం భూమి ఉన్నట్లయితే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వార్డు అభివృద్ధి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరినట్లు తెలిపారు.వెంచర్లోని 10 శాతం భూమిపై స్థానిక ప్రజల్లో పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు కోరారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు రిశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి