ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ-కాప్స్ విధుల్లో భాగంగా కార్యాలయానికి అటాచ్ అయిన యువ కానిస్టేబుల్ జె. సాయికుమార్ (13128) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కార్యాలయంలోని రెస్ట్రూమ్లో సాయికుమార్ను అపస్మారక స్థితిలో గుర్తించిన తోటి సిబ్బంది వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
2024 బ్యాచ్ కానిస్టేబుల్.
సాయికుమార్ 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్గా పోలీసులు గుర్తించారు. కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి