శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ
అగ్నిమాపక, ఇంటర్ విద్యాశాఖ తనిఖీలకు డిమాండ్
పుస్తకాలు, యూనిఫాంల పేరుతో రూ.20 వేల వరకు వసూలు చేస్తున్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల ప్రాణ భద్రతను మాత్రం గాలికొదిలేసిందని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కళాశాలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు నిబంధనల ప్రకారం లేవని, ప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడేందుకు అత్యవసర (ఎగ్జిట్) మార్గాలు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం సంభవిస్తే పైఅంతస్తుల్లో ఉండే వందలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా అగ్నిమాపక, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కళాశాలను నేరుగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు మంజూరైన సీట్లు, చదువుతున్న విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది అర్హతలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్, వంశీ, నితిన్, లోకేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి