Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 09:28 PM

​రూ.20 వేల దందాపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై ఏదీ?

​రూ.20 వేల దందాపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై ఏదీ?

​రూ.20 వేల దందాపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై ఏదీ?
11-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

అగ్నిమాపక, ఇంటర్ విద్యాశాఖ తనిఖీలకు డిమాండ్

పుస్తకాలు, యూనిఫాంల పేరుతో రూ.20 వేల వరకు వసూలు చేస్తున్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల ప్రాణ భద్రతను మాత్రం గాలికొదిలేసిందని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

​కళాశాలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు నిబంధనల ప్రకారం లేవని, ప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడేందుకు అత్యవసర (ఎగ్జిట్) మార్గాలు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవిస్తే పైఅంతస్తుల్లో ఉండే వందలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ​కార్యాలయాలకే పరిమితం కాకుండా అగ్నిమాపక, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కళాశాలను నేరుగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు మంజూరైన సీట్లు, చదువుతున్న విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది అర్హతలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్, వంశీ, నితిన్, లోకేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​రూ.20 వేల దందాపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భద్రతపై ఏదీ?

Article Image

శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ

అగ్నిమాపక, ఇంటర్ విద్యాశాఖ తనిఖీలకు డిమాండ్

పుస్తకాలు, యూనిఫాంల పేరుతో రూ.20 వేల వరకు వసూలు చేస్తున్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల ప్రాణ భద్రతను మాత్రం గాలికొదిలేసిందని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

​కళాశాలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు నిబంధనల ప్రకారం లేవని, ప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడేందుకు అత్యవసర (ఎగ్జిట్) మార్గాలు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవిస్తే పైఅంతస్తుల్లో ఉండే వందలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ​కార్యాలయాలకే పరిమితం కాకుండా అగ్నిమాపక, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కళాశాలను నేరుగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు మంజూరైన సీట్లు, చదువుతున్న విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది అర్హతలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్, వంశీ, నితిన్, లోకేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News