Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 01:29 PM

చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో ఏ. రాములు.

చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో ఏ. రాములు.

చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ.  ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో  ఏ. రాములు.
11-08-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ల కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఎంపీడీవో ఆర్. రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే గ్రామపంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేయని వారు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏ . రాములు కోరారు.

Sthanikam

చేయూత పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో ఏ. రాములు.

Article Image

రామన్నపేట, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ల కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఎంపీడీవో ఆర్. రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే గ్రామపంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేయని వారు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏ . రాములు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News