రామన్నపేట, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ల కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఎంపీడీవో ఆర్. రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే గ్రామపంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేయని వారు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏ . రాములు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి