Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 09:16 PM

నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం

నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం

నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం
10-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సతీమణి సుశీల విశ్వనాథ్, పాఠశాల కరస్పాండెంట్ కమ్మరి వెంకటరత్నం, ప్రిన్సిపల్ కమ్మరి ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.

Sthanikam

నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం

Article Image

నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సతీమణి సుశీల విశ్వనాథ్, పాఠశాల కరస్పాండెంట్ కమ్మరి వెంకటరత్నం, ప్రిన్సిపల్ కమ్మరి ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News