నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సతీమణి సుశీల విశ్వనాథ్, పాఠశాల కరస్పాండెంట్ కమ్మరి వెంకటరత్నం, ప్రిన్సిపల్ కమ్మరి ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.
నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం
నియో ప్రగతి పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనం
Krishna
నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సతీమణి సుశీల విశ్వనాథ్, పాఠశాల కరస్పాండెంట్ కమ్మరి వెంకటరత్నం, ప్రిన్సిపల్ కమ్మరి ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి