Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:18 PM

లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

లేపాక్షిలో జరగనున్న  సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
July 11, 2026 06:07 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నల్లమడ మండల కేంద్రంలో శిక్షణా తరగతుల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.సిపిఐ నల్లమడ మండల కార్యదర్శి వలిపి వెంకటరమణ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29వ తేదీలలో లేపాక్షి నందు సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల పేరుతో రైతుల వద్ద సేకరించిన భూములలో వెంటనే పరిశ్రమలు పెట్టాలని లేదంటే ఆ భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరా రెండెకరాలు ఉన్న రైతుల దగ్గర భూముల సేకరించడం భూస్వాములు దగ్గర ప్రభుత్వ భూమి పరిశ్రమల కోసం తీసుకోవాలని డిమాండ్ చేశారు, హంద్రీనీవా కాలువలో కంపచెట్లను తొలగించాలని సత్యసాయి జిల్లాలోని అన్ని చెరువులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ ప్రక్రియ గడువు తేదీ ఈనెల 14 నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు పెంచాలని డిమాండ్ చేశారు. చాలామంది వలసలు పోయి బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి నగరాలకు పొట్టకూటి కోసం వలసలు పోయిన నిజమైన అర్హత కలిగినటువంటి ఓటర్లను తొలగించకుండా వారికి సమయం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియను గమనించాలని అర్హత కలిగినటువంటి నిజమైన ఓటర్లను తొలగిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసి తొలగించిన ఓటర్లను మరల పునరుద్ధరించాలని ప్రజలు ఇది గమనించాలని తెలిపారు,

భవిష్యత్తులో సత్యసాయి జిల్లాలో బలమైన ఉద్యమాలను చేపట్టడానికి ఈనెల 27,28,29 తేదీలలో లేపాక్షి నందు జిల్లా సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు నాగేంద్ర, గంగాద్రి, మండల కార్యవర్గ సభ్యులు రూప్లా నాయక్, కేసప్ప, చెన్నయ్య, నాగరాజు, గంగన్న, వెంకటరామప్ప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News