లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
Anjali
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నల్లమడ మండల కేంద్రంలో శిక్షణా తరగతుల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.సిపిఐ నల్లమడ మండల కార్యదర్శి వలిపి వెంకటరమణ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29వ తేదీలలో లేపాక్షి నందు సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల పేరుతో రైతుల వద్ద సేకరించిన భూములలో వెంటనే పరిశ్రమలు పెట్టాలని లేదంటే ఆ భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరా రెండెకరాలు ఉన్న రైతుల దగ్గర భూముల సేకరించడం భూస్వాములు దగ్గర ప్రభుత్వ భూమి పరిశ్రమల కోసం తీసుకోవాలని డిమాండ్ చేశారు, హంద్రీనీవా కాలువలో కంపచెట్లను తొలగించాలని సత్యసాయి జిల్లాలోని అన్ని చెరువులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ ప్రక్రియ గడువు తేదీ ఈనెల 14 నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు పెంచాలని డిమాండ్ చేశారు. చాలామంది వలసలు పోయి బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి నగరాలకు పొట్టకూటి కోసం వలసలు పోయిన నిజమైన అర్హత కలిగినటువంటి ఓటర్లను తొలగించకుండా వారికి సమయం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియను గమనించాలని అర్హత కలిగినటువంటి నిజమైన ఓటర్లను తొలగిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసి తొలగించిన ఓటర్లను మరల పునరుద్ధరించాలని ప్రజలు ఇది గమనించాలని తెలిపారు,
భవిష్యత్తులో సత్యసాయి జిల్లాలో బలమైన ఉద్యమాలను చేపట్టడానికి ఈనెల 27,28,29 తేదీలలో లేపాక్షి నందు జిల్లా సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు నాగేంద్ర, గంగాద్రి, మండల కార్యవర్గ సభ్యులు రూప్లా నాయక్, కేసప్ప, చెన్నయ్య, నాగరాజు, గంగన్న, వెంకటరామప్ప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి