Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:42 PM

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన
April 11, 2026 02:53 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామం నుండి బీదానిపల్లికి నూతనంగా వేస్తున్న తారు రోడ్డు పనులను ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిశీలించారు.

గతంలో కంబాలపల్లి మరియు బీదానిపల్లి గ్రామాల ప్రజలు సరైన రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా చౌకధాన్యపు డిపో నుండి బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంలో బీదానిపల్లి గ్రామస్తులు ఎన్నో కష్టాలు పడేవారు.

ఈ సమస్యలను గుర్తించిన కంబాలపల్లి గ్రామ సర్పంచ్ మంజునాథ్, సుమారు 20 రోజుల క్రితం రొద్దం మండలం టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వివరించారు.

దీనికి వెంటనే స్పందించిన మంత్రి సవితమ్మ సుమారు మూడు కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చి, పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండగా, సర్పంచ్ మంజునాథ్ మరియు స్థానిక నాయకులతో కలిసి యువ నాయకులు పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా బీదానిపల్లి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించిన మంత్రి సవితమ్మ గారికి, మండల నాయకులకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News