Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:46 AM

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన
April 11, 2026 02:53 PM 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామం నుండి బీదానిపల్లికి నూతనంగా వేస్తున్న తారు రోడ్డు పనులను ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిశీలించారు.

గతంలో కంబాలపల్లి మరియు బీదానిపల్లి గ్రామాల ప్రజలు సరైన రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా చౌకధాన్యపు డిపో నుండి బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంలో బీదానిపల్లి గ్రామస్తులు ఎన్నో కష్టాలు పడేవారు.

ఈ సమస్యలను గుర్తించిన కంబాలపల్లి గ్రామ సర్పంచ్ మంజునాథ్, సుమారు 20 రోజుల క్రితం రొద్దం మండలం టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వివరించారు.

దీనికి వెంటనే స్పందించిన మంత్రి సవితమ్మ సుమారు మూడు కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చి, పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండగా, సర్పంచ్ మంజునాథ్ మరియు స్థానిక నాయకులతో కలిసి యువ నాయకులు పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా బీదానిపల్లి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించిన మంత్రి సవితమ్మ గారికి, మండల నాయకులకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News