Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:35 PM

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన

కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన
April 11, 2026 02:53 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామం నుండి బీదానిపల్లికి నూతనంగా వేస్తున్న తారు రోడ్డు పనులను ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరిశీలించారు.

గతంలో కంబాలపల్లి మరియు బీదానిపల్లి గ్రామాల ప్రజలు సరైన రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా చౌకధాన్యపు డిపో నుండి బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంలో బీదానిపల్లి గ్రామస్తులు ఎన్నో కష్టాలు పడేవారు.

ఈ సమస్యలను గుర్తించిన కంబాలపల్లి గ్రామ సర్పంచ్ మంజునాథ్, సుమారు 20 రోజుల క్రితం రొద్దం మండలం టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వివరించారు.

దీనికి వెంటనే స్పందించిన మంత్రి సవితమ్మ సుమారు మూడు కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చి, పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండగా, సర్పంచ్ మంజునాథ్ మరియు స్థానిక నాయకులతో కలిసి యువ నాయకులు పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా బీదానిపల్లి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించిన మంత్రి సవితమ్మ గారికి, మండల నాయకులకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News