Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం

పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం

పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం
05-07-2026 976 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 5: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Sthanikam

పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం

Article Image

చిట్యాల, జూలై 5: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News