పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం
పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 5: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి