Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ

దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ

దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ
04-07-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు


తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమరయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సామాజిక న్యాయం, రైతాంగ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చరిత్రను మరువకుండా మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.


దొడ్డి కొమరయ్య వంటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే సమాజంలో ప్రజాస్వామ్య విలువలు బలపడుతున్నాయని, వారి స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ

Article Image

వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు


తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమరయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సామాజిక న్యాయం, రైతాంగ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చరిత్రను మరువకుండా మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.


దొడ్డి కొమరయ్య వంటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే సమాజంలో ప్రజాస్వామ్య విలువలు బలపడుతున్నాయని, వారి స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News