దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ
దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ
Vikram Journalist
వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఘనంగా నివాళులు
తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమరయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సామాజిక న్యాయం, రైతాంగ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చరిత్రను మరువకుండా మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
దొడ్డి కొమరయ్య వంటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే సమాజంలో ప్రజాస్వామ్య విలువలు బలపడుతున్నాయని, వారి స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి