Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 11:24 PM

రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ

రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ

రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ
June 27, 2026 09:47 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం, జూన్ 27: రొద్దం మండల కేంద్రంలోని అనంతశక్తి సొసైటీ ఆవరణలో అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు సుశీలమ్మ, కార్యనిర్వాహణ అధికారి లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టింబుక్టూ కలెక్టివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుకన్య, వ్యవస్థాపకులు బబ్బులు గంగూలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ, గత ఏడు సంవత్సరాలుగా అనంతశక్తి సొసైటీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ప్రస్తుతం 10,459 మంది సభ్యులతో రూ.20.97 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవడం అభినందనీయమన్నారు. సభ్యత్వం పెరిగిన నేపథ్యంలో మరింత క్రమశిక్షణ, పారదర్శకతతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు సామాజిక, ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ వారిపై హింస కొనసాగుతోందని, అలాంటి సమస్యలను సంఘటిత శక్తితో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.


టింబుక్టూ కలెక్టివ్ వ్యవస్థాపకులు బబ్బులు గంగూలీ మాట్లాడుతూ, మహిళలే స్వయంగా సంస్థను నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయమని కొనియాడారు. దేశంలో ఇలాంటి మహిళా ఆధ్వర్య సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని, అనంతశక్తి సొసైటీ వాటిలో ఒకటిగా నిలిచిందన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అహింసా మార్గంలో పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.


అనంతరం సీఈవో లావణ్య వార్షిక నివేదికను, అకౌంటెంట్ మాధవి ఆర్థిక నివేదికను సభలో ప్రవేశపెట్టారు. పాలకవర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టడంతో పాటు, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులతో చర్చించారు.


ఈ కార్యక్రమంలో మహాశక్తి సీఈవో రమీజ, మేనేజర్ గౌరి, అనంతశక్తి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News