రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ
రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ
EDIGA NAVEENKUMAR
రొద్దం, జూన్ 27: రొద్దం మండల కేంద్రంలోని అనంతశక్తి సొసైటీ ఆవరణలో అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు సుశీలమ్మ, కార్యనిర్వాహణ అధికారి లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టింబుక్టూ కలెక్టివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుకన్య, వ్యవస్థాపకులు బబ్బులు గంగూలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ, గత ఏడు సంవత్సరాలుగా అనంతశక్తి సొసైటీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ప్రస్తుతం 10,459 మంది సభ్యులతో రూ.20.97 కోట్ల టర్నోవర్కు చేరుకోవడం అభినందనీయమన్నారు. సభ్యత్వం పెరిగిన నేపథ్యంలో మరింత క్రమశిక్షణ, పారదర్శకతతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు సామాజిక, ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ వారిపై హింస కొనసాగుతోందని, అలాంటి సమస్యలను సంఘటిత శక్తితో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
టింబుక్టూ కలెక్టివ్ వ్యవస్థాపకులు బబ్బులు గంగూలీ మాట్లాడుతూ, మహిళలే స్వయంగా సంస్థను నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయమని కొనియాడారు. దేశంలో ఇలాంటి మహిళా ఆధ్వర్య సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని, అనంతశక్తి సొసైటీ వాటిలో ఒకటిగా నిలిచిందన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అహింసా మార్గంలో పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అనంతరం సీఈవో లావణ్య వార్షిక నివేదికను, అకౌంటెంట్ మాధవి ఆర్థిక నివేదికను సభలో ప్రవేశపెట్టారు. పాలకవర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టడంతో పాటు, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మహాశక్తి సీఈవో రమీజ, మేనేజర్ గౌరి, అనంతశక్తి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి