Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 08:51 AM

చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు

చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు

చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు
28-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించే దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు రేగడి నరసింహప్ప పొలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, తక్కువ వర్షపాతం పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విధానం ద్వారా వర్షాలపై ఆధారపడకుండా ముందుగానే విత్తనం వేసి మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు.


మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF పరిధిలో అమలవుతున్న వివిధ సాగు నమూనాలను క్షేత్ర స్థాయిలో వివరించారు. ముఖ్యంగా Half-Moon, ATM, Dr.Pr., A-Grade మోడల్స్ ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచే మార్గాలను ప్రదర్శించారు.


ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.రాజేష్, ఏఈఓ హంసవేణి, రైతు సేవ కేంద్రం సిబ్బంది, ICRPలు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


ఈ శిక్షణతో రైతులు వర్షాభావ పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన సాగు పద్ధతులను అవలంబించేందుకు అవగాహన పొందారు.


Sthanikam

చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు

Article Image

రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించే దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు రేగడి నరసింహప్ప పొలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, తక్కువ వర్షపాతం పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విధానం ద్వారా వర్షాలపై ఆధారపడకుండా ముందుగానే విత్తనం వేసి మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు.


మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF పరిధిలో అమలవుతున్న వివిధ సాగు నమూనాలను క్షేత్ర స్థాయిలో వివరించారు. ముఖ్యంగా Half-Moon, ATM, Dr.Pr., A-Grade మోడల్స్ ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచే మార్గాలను ప్రదర్శించారు.


ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.రాజేష్, ఏఈఓ హంసవేణి, రైతు సేవ కేంద్రం సిబ్బంది, ICRPలు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


ఈ శిక్షణతో రైతులు వర్షాభావ పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన సాగు పద్ధతులను అవలంబించేందుకు అవగాహన పొందారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News