చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు
చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు
EDIGA NAVEENKUMAR
రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించే దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు రేగడి నరసింహప్ప పొలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, తక్కువ వర్షపాతం పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విధానం ద్వారా వర్షాలపై ఆధారపడకుండా ముందుగానే విత్తనం వేసి మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు.
మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF పరిధిలో అమలవుతున్న వివిధ సాగు నమూనాలను క్షేత్ర స్థాయిలో వివరించారు. ముఖ్యంగా Half-Moon, ATM, Dr.Pr., A-Grade మోడల్స్ ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచే మార్గాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.రాజేష్, ఏఈఓ హంసవేణి, రైతు సేవ కేంద్రం సిబ్బంది, ICRPలు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ శిక్షణతో రైతులు వర్షాభావ పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన సాగు పద్ధతులను అవలంబించేందుకు అవగాహన పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి