పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో పీఎండీఎస్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారిణి ఎస్. విజయభారతి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ పీఎండీఎస్ విధానంతో మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
మాస్టర్ ట్రైనర్ మల్లికార్జున వివరాల ప్రకారం, పొడి నేలలోనే 15-20 రకాల విత్తనాలు వేసి, వర్షం పడగానే మొలకెత్తేలా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పద్ధతిలో రసాయనాలు అవసరం లేకుండా జీవామృతంతోనే పంటలు సాగు చేసి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని వెల్లడించారు. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
అధికారులు చియా పంట సాగుతో ఎకరానికి రూ.70-80 వేల ఆదాయం పొందవచ్చని సూచించారు. అలాగే APAIMS యాప్ ద్వారా పంట వివరాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా తెలుసుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు మరియు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి