హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి
Komidala Mahender reddy
మృతదేహం తరలింపుపై అనుమానాలు.. గోప్యత ఎందుకని ప్రశ్నలు.
యాదాద్రి భువనగిరి, జూలై 16:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం సమీపంలోని హెజిలో ఫార్మా కంపెనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంపెనీలో షిఫ్ట్ ఇంచార్జ్గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి (42) విధి నిర్వహణలో ఉండగా రియాక్టర్లో పడి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటన అనంతరం కంపెనీ యాజమాన్యం విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్కు తరలించి గోప్యంగా ఉంచినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా యాజమాన్యం మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కార్మిక వర్గాలు, స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అధికారికంగా కంపెనీ యాజమాన్యం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి