Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి

హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి

హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి
16-07-2026 2,012 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


మృతదేహం తరలింపుపై అనుమానాలు.. గోప్యత ఎందుకని ప్రశ్నలు.


యాదాద్రి భువనగిరి, జూలై 16:

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం సమీపంలోని హెజిలో ఫార్మా కంపెనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంపెనీలో షిఫ్ట్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి (42) విధి నిర్వహణలో ఉండగా రియాక్టర్‌లో పడి మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటన అనంతరం కంపెనీ యాజమాన్యం విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు తరలించి గోప్యంగా ఉంచినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా యాజమాన్యం మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కార్మిక వర్గాలు, స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అధికారికంగా కంపెనీ యాజమాన్యం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి

Article Image


మృతదేహం తరలింపుపై అనుమానాలు.. గోప్యత ఎందుకని ప్రశ్నలు.


యాదాద్రి భువనగిరి, జూలై 16:

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం సమీపంలోని హెజిలో ఫార్మా కంపెనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంపెనీలో షిఫ్ట్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి (42) విధి నిర్వహణలో ఉండగా రియాక్టర్‌లో పడి మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటన అనంతరం కంపెనీ యాజమాన్యం విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు తరలించి గోప్యంగా ఉంచినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా యాజమాన్యం మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కార్మిక వర్గాలు, స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అధికారికంగా కంపెనీ యాజమాన్యం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News