Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 11:26 PM

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై ఆరోపణలు అవాస్తవం

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై ఆరోపణలు అవాస్తవం

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై ఆరోపణలు అవాస్తవం
July 16, 2026 07:52 PM 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్పష్టం చేసిన డీఎల్పీఓ ప్రతాప్ నాయక్

గ్రామపంచాయతీలో విచారణ.. సీసీ రోడ్డు పనుల పరిశీలన

చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్‌పై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా స్థానిక పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) ప్రతాప్ నాయక్ స్పష్టం చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు చేసిన ఫిర్యాదుపై గురువారం ఆయన విచారణ చేపట్టారు. అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విచారణ అనంతరం సర్పంచ్‌పై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా అవాస్తవమని డీఎల్పీఓ తేల్చిచెప్పారు.​​అనంతరం సీఎస్‌ఆర్ నిధుల ద్వారా దివీస్ సంస్థ సౌజన్యంతో రూ. 98 లక్షల వ్యయంతో గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను డీఎల్పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ పనులకు ఎవరూ ఆటంకాలు కల్పించకుండా సహకరించాలని కోరారు. గ్రామంలో 20 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీలు, అరుగులు, ర్యాంపులను గుర్తించి కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేస్తామన్నారు.కొలతల ప్రకారం ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని హెచ్చరించారు.​రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ఇరువైపులా మిగిలిన ఖాళీ ప్రదేశాల్లో గ్రామపంచాయతీ నిధులతో పూర్తి స్థాయి రోడ్లను అభివృద్ధి చేస్తామని సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ తెలిపారు. గ్రామాభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News