అంకిరెడ్డిగూడెం సర్పంచ్పై ఆరోపణలు అవాస్తవం
అంకిరెడ్డిగూడెం సర్పంచ్పై ఆరోపణలు అవాస్తవం
K.RAVI
స్పష్టం చేసిన డీఎల్పీఓ ప్రతాప్ నాయక్
గ్రామపంచాయతీలో విచారణ.. సీసీ రోడ్డు పనుల పరిశీలన
చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్పై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా స్థానిక పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) ప్రతాప్ నాయక్ స్పష్టం చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు చేసిన ఫిర్యాదుపై గురువారం ఆయన విచారణ చేపట్టారు. అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విచారణ అనంతరం సర్పంచ్పై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా అవాస్తవమని డీఎల్పీఓ తేల్చిచెప్పారు.అనంతరం సీఎస్ఆర్ నిధుల ద్వారా దివీస్ సంస్థ సౌజన్యంతో రూ. 98 లక్షల వ్యయంతో గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను డీఎల్పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ పనులకు ఎవరూ ఆటంకాలు కల్పించకుండా సహకరించాలని కోరారు. గ్రామంలో 20 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీలు, అరుగులు, ర్యాంపులను గుర్తించి కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేస్తామన్నారు.కొలతల ప్రకారం ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని హెచ్చరించారు.రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ఇరువైపులా మిగిలిన ఖాళీ ప్రదేశాల్లో గ్రామపంచాయతీ నిధులతో పూర్తి స్థాయి రోడ్లను అభివృద్ధి చేస్తామని సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ తెలిపారు. గ్రామాభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి