Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 06:53 PM

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం
July 13, 2026 04:26 PM 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల, నల్లగొండ జిల్లా: జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు డీజిల్ దొంగల ముఠా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డ్రైవర్ కాసేపు నిద్రలోకి జారుకుంటే చాలు.. ట్యాంక్ ఖాళీ చేసి పరారవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిట్యాల పట్టణ పరిధిలో జరిగిన డీజిల్ చోరీ ఘటన లారీ డ్రైవర్లలో భయాందోళనలకు గురిచేస్తోంది.

కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్‌కు నిద్ర రావడంతో చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు లారీ డీజిల్ ట్యాంక్ మూతను ఐరన్ రాడ్లతో పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్‌ను చాకచక్యంగా అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డీజిల్ చోరీ సమయంలో లారీ పక్కనే ఏపీ30 ఎం 1377 నంబర్ గల కారు నిలిపి ఉంచి అందులో డీజిల్ తరలించినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఘటన సమయంలో స్థానికులు ఆ కారును గమనించి ఫోటోలు కూడా తీసినట్లు సమాచారం. డ్రైవర్ మేల్కొనేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వాహనం వివరాలు, స్థానికులు తీసిన ఫోటోలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలు లారీ డ్రైవర్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో హైవే పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు గస్తీ బలోపేతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. డీజిల్ దొంగల ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు, లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News