Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం
13-07-2026 311 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల, నల్లగొండ జిల్లా: జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు డీజిల్ దొంగల ముఠా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డ్రైవర్ కాసేపు నిద్రలోకి జారుకుంటే చాలు.. ట్యాంక్ ఖాళీ చేసి పరారవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిట్యాల పట్టణ పరిధిలో జరిగిన డీజిల్ చోరీ ఘటన లారీ డ్రైవర్లలో భయాందోళనలకు గురిచేస్తోంది.

కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్‌కు నిద్ర రావడంతో చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు లారీ డీజిల్ ట్యాంక్ మూతను ఐరన్ రాడ్లతో పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్‌ను చాకచక్యంగా అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డీజిల్ చోరీ సమయంలో లారీ పక్కనే ఏపీ30 ఎం 1377 నంబర్ గల కారు నిలిపి ఉంచి అందులో డీజిల్ తరలించినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఘటన సమయంలో స్థానికులు ఆ కారును గమనించి ఫోటోలు కూడా తీసినట్లు సమాచారం. డ్రైవర్ మేల్కొనేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వాహనం వివరాలు, స్థానికులు తీసిన ఫోటోలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలు లారీ డ్రైవర్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో హైవే పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు గస్తీ బలోపేతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. డీజిల్ దొంగల ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు, లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Sthanikam

చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం

Article Image


చిట్యాల, నల్లగొండ జిల్లా: జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు డీజిల్ దొంగల ముఠా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డ్రైవర్ కాసేపు నిద్రలోకి జారుకుంటే చాలు.. ట్యాంక్ ఖాళీ చేసి పరారవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిట్యాల పట్టణ పరిధిలో జరిగిన డీజిల్ చోరీ ఘటన లారీ డ్రైవర్లలో భయాందోళనలకు గురిచేస్తోంది.

కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్‌కు నిద్ర రావడంతో చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు లారీ డీజిల్ ట్యాంక్ మూతను ఐరన్ రాడ్లతో పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్‌ను చాకచక్యంగా అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డీజిల్ చోరీ సమయంలో లారీ పక్కనే ఏపీ30 ఎం 1377 నంబర్ గల కారు నిలిపి ఉంచి అందులో డీజిల్ తరలించినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఘటన సమయంలో స్థానికులు ఆ కారును గమనించి ఫోటోలు కూడా తీసినట్లు సమాచారం. డ్రైవర్ మేల్కొనేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వాహనం వివరాలు, స్థానికులు తీసిన ఫోటోలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలు లారీ డ్రైవర్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో హైవే పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు గస్తీ బలోపేతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. డీజిల్ దొంగల ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు, లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News