షాబాద్ మారణహోమం నిందితుడి కథ ముగిసింది
షాబాద్ మారణహోమం నిందితుడి కథ ముగిసింది
Komidala Mahender reddy
పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే విషం బాటిల్.. ఆత్మహత్యగా అనుమానం.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో మైనర్ బాలిక సహా ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో సోమవారం అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రాజ్కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజ్కుమార్ తన మేనమామ గ్రామమైన పంజర్లకు వెళ్లి అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
కాగా, షాబాద్లో ఇటీవల మైనర్ బాలికతో పాటు ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన రాజ్కుమార్ మృతితో ఘటన మరో కీలక మలుపు తిరిగింది. అయితే అతని మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడికానున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి