Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి – వీరమళ్ళ కార్తీక్ గౌడ్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 06:49 PM

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది

షాబాద్‌ మారణహోమం నిందితుడి కథ ముగిసింది
July 13, 2026 05:09 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే విషం బాటిల్.. ఆత్మహత్యగా అనుమానం.


రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో మైనర్ బాలిక సహా ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో సోమవారం అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రాజ్‌కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ తన మేనమామ గ్రామమైన పంజర్లకు వెళ్లి అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

కాగా, షాబాద్‌లో ఇటీవల మైనర్ బాలికతో పాటు ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన రాజ్‌కుమార్ మృతితో ఘటన మరో కీలక మలుపు తిరిగింది. అయితే అతని మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడికానున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News