షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ మృతి
షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ మృతి
Biksham
కొత్తూరు మండలంలోని పంజర్లలో మృతదేహం లభ్యం.. ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
రంగారెడ్డి జిల్లా షాబాద్లో బాలిక సహా ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ మృతిచెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో సోమవారం అతని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, రాజ్కుమార్ మృతదేహం సమీపంలో విషం బాటిల్ లభ్యమైంది. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, పంజర్ల గ్రామం రాజ్కుమార్ మేనమామ స్వగ్రామం కావడంతో అక్కడికి వచ్చి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, షాబాద్లో ఇటీవల చోటుచేసుకున్న దారుణ ఘటనలో బాలికతో పాటు మొత్తం ఆరుగురిని హత్య చేసిన కేసులో రాజ్కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి