ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్పీ నేతలు
ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్పీ నేతలు
Biksham
ఆత్మగౌరవ పోరాటాలకు ఐక్యంగా ముందుకు రావాలి : వట్టే జానయ్య యాదవ్
హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా హైదరాబాద్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అవమానకర వ్యాఖ్యలు, వివక్షను ఇకపై సహించబోమన్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అన్ని బహుజన వర్గాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని పేర్కొన్న ఆయన, భావితరం బానిసత్వ భావజాలాన్ని అంగీకరించదన్నారు. వెనుకబడిన వర్గాల రాజకీయ, సామాజిక సాధికారత కోసం ఐక్య ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుని, అనంతరం వారి సమస్యలను విస్మరించే రాజకీయ ధోరణులు మారాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి గౌరవం, సమాన అవకాశాలు లభించేలా పోరాటం కొనసాగించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈశ్వరమ్మ యాదవ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి