Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 07:24 PM

ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్‌పీ నేతలు

ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్‌పీ నేతలు

ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్‌పీ నేతలు
July 13, 2026 05:47 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మగౌరవ పోరాటాలకు ఐక్యంగా ముందుకు రావాలి : వట్టే జానయ్య యాదవ్


హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అవమానకర వ్యాఖ్యలు, వివక్షను ఇకపై సహించబోమన్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అన్ని బహుజన వర్గాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని పేర్కొన్న ఆయన, భావితరం బానిసత్వ భావజాలాన్ని అంగీకరించదన్నారు. వెనుకబడిన వర్గాల రాజకీయ, సామాజిక సాధికారత కోసం ఐక్య ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుని, అనంతరం వారి సమస్యలను విస్మరించే రాజకీయ ధోరణులు మారాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి గౌరవం, సమాన అవకాశాలు లభించేలా పోరాటం కొనసాగించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News