చిట్యాలలో అరుదైన ఘటన.. రూ.10 కాయిన్లతో స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు
చిట్యాలలో అరుదైన ఘటన.. రూ.10 కాయిన్లతో స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి వినూత్నంగా నూతన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. చిట్యాల పట్టణంలోని శ్రీ వినాయక మోటార్స్లో స్ప్లెండర్ ప్లస్ బైక్ను కొనుగోలు చేసిన ఆయన, వాహనం ధరకు సంబంధించిన మొత్తం రూ.1,10,000 నగదును రూ.10 కాయిన్ల రూపంలో చెల్లించారు.
ఈ సందర్భంగా శ్రీ వినాయక మోటార్స్ నిర్వాహకుడు ఉప్పు మధు మాట్లాడుతూ, కస్టమర్ మొత్తం చెల్లింపును రూ.10 నాణేల రూపంలో అందజేశారని తెలిపారు. నాణేలను లెక్కించేందుకు కొంత సమయం పట్టినప్పటికీ, చెల్లుబాటు అయ్యే కరెన్సీ కావడంతో వాటిని స్వీకరించినట్లు చెప్పారు.సాధారణంగా పెద్ద మొత్తాల లావాదేవీలు నగదు లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతుండగా, ఒకేసారి లక్షకు పైగా మొత్తాన్ని రూ.10 కాయిన్ల రూపంలో చెల్లించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను చూసిన పలువురు ఆసక్తిగా వీక్షించగా, రఘుపతి తీసుకున్న నిర్ణయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్థానికంగా ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లోనూ చర్చకు దారి తీస్తుండగా, భారీ మొత్తంలో నాణేలతో బైక్ కొనుగోలు చేసిన ఘటన అరుదైన ఉదాహరణగా నిలిచింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి