పూర్తయిన జర్నలిస్టుల ఇళ్లకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు వినతి
పూర్తయిన జర్నలిస్టుల ఇళ్లకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు వినతి
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించి, పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం జర్నలిస్టులు సబ్ కలెక్టర్ ఉమ హారతికి వినతిపత్రం సమర్పించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న జర్నలిస్టుల కాలనీలో పలువురు తమ సొంత ఖర్చులతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు మంజూరు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమ హారతి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అమృత్, శ్రీకాంత్, పుండరీకం, మధుసూదన్, ఖైసర్, గోవర్ధన్, శ్రీనివాస్, రమేష్, మజహర్ ఖాన్ చిస్తీ, సంగప్ప, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి