రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్గా శ్రవణ్ కుమార్ గౌడ్.
రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్గా శ్రవణ్ కుమార్ గౌడ్.
Editor Desk
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాన్ని మరింత విస్తరించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా పోలేగౌని శ్రవణ్ కుమార్ గౌడ్ను తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్గా నియమించారు.
ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యత అప్పగించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్లు డా. జూలూరి ధనలక్ష్మి బాలన్నారాయణ, డా. కేత్తూరి వెంకటేష్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మందముళ్ల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఓబీసీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఓబీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి