చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం కావాలి. డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్.
చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం కావాలి. డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్.
Editor Desk
రామన్నపేట
చేనేత సహకార సంఘాల అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటేష్ సూచించారు.
టెర్రీ కాటన్ చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులను మంగళవారం శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు సమష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను చేనేత కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
సంఘం అధ్యక్షుడిగా పెండెం వేణు, ఉపాధ్యక్షుడిగా వనం నరసింహ, కార్యదర్శిగా దొంత నాగరాజు ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా గంజి సువర్ణ, సూర్యపెల్లి లావణ్య, అప్పం సంతోష్, పెండెం భావనారుషి, బోడ యాదగిరి, వనం సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.
ఎన్నికల అధికారిగా కె. సురేష్ వ్యవహరించి, నూతన పాలకవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి