మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సల్మాన్ రాజుకు రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కోసిగి సీనియర్ నాయకుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగినేని అయ్యన్న, నాడిగినేని మహదేవ, రచ్చమర్రి విజయ్, క్లస్టర్ ఇన్చార్జి రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి