Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 10:44 PM

ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడికి జరిమానా.

ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడికి జరిమానా.

ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడికి  జరిమానా.
July 07, 2026 09:03 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల ప్రాణాలు, రక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు పుట్టపర్తి అర్బన్ సీఐ యువరాజు తెలిపారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించిన స్థితిలో వాహనాలు నడుపుతున్న ఒక ఆటో డ్రైవర్, ఒక ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు గుర్తించారు. బ్రెత్ అనలైజర్ పరీక్షలో వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేశారు.

అనంతరం వారిద్దరినీ ఈరోజు మంగళవారం పుట్టపర్తి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరచగా, కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తి ఇద్దరికీ రూ.10,000 చొప్పున మొత్తం రూ.20,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా సీఐ యువరాజు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమే కాకుండా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని అటువంటి వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News