Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో అరుదైన ఘటన.. రూ.10 కాయిన్లతో స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 06:20 PM

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు
July 07, 2026 04:22 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడంతో సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అదే విధంగా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎల్లంబావికి చెందిన కంకల బీరయ్య, కార్యదర్శిగా ఏపూర్ గ్రామానికి చెందిన కొండె వెంకటేష్, కోశాధికారిగా కాట్రేవుకు చెందిన దిందే ఆడవయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

డైరెక్టర్లుగా గుండ్రాంపల్లికి చెందిన కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ, అంతమ్మగూడెంకు చెందిన వస్పరి జహంగీర్, వేలిమినేడుకు చెందిన కొండె మహేష్, ఎల్లంబావికి చెందిన బాలం జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్ మాట్లాడుతూ సంఘ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

సభ్యుల సంక్షేమం, సంఘ బలోపేతం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

సంఘం నూతన కార్యవర్గానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధించి సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News