ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు
ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు
Komidala Mahender reddy
చిట్యాల మండలంలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడంతో సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే విధంగా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎల్లంబావికి చెందిన కంకల బీరయ్య, కార్యదర్శిగా ఏపూర్ గ్రామానికి చెందిన కొండె వెంకటేష్, కోశాధికారిగా కాట్రేవుకు చెందిన దిందే ఆడవయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.
డైరెక్టర్లుగా గుండ్రాంపల్లికి చెందిన కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ, అంతమ్మగూడెంకు చెందిన వస్పరి జహంగీర్, వేలిమినేడుకు చెందిన కొండె మహేష్, ఎల్లంబావికి చెందిన బాలం జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్ మాట్లాడుతూ సంఘ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
సభ్యుల సంక్షేమం, సంఘ బలోపేతం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
సంఘం నూతన కార్యవర్గానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధించి సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి