Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు
07-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడంతో సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అదే విధంగా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎల్లంబావికి చెందిన కంకల బీరయ్య, కార్యదర్శిగా ఏపూర్ గ్రామానికి చెందిన కొండె వెంకటేష్, కోశాధికారిగా కాట్రేవుకు చెందిన దిందే ఆడవయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

డైరెక్టర్లుగా గుండ్రాంపల్లికి చెందిన కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ, అంతమ్మగూడెంకు చెందిన వస్పరి జహంగీర్, వేలిమినేడుకు చెందిన కొండె మహేష్, ఎల్లంబావికి చెందిన బాలం జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్ మాట్లాడుతూ సంఘ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

సభ్యుల సంక్షేమం, సంఘ బలోపేతం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

సంఘం నూతన కార్యవర్గానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధించి సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

Article Image

చిట్యాల మండలంలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడంతో సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అదే విధంగా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎల్లంబావికి చెందిన కంకల బీరయ్య, కార్యదర్శిగా ఏపూర్ గ్రామానికి చెందిన కొండె వెంకటేష్, కోశాధికారిగా కాట్రేవుకు చెందిన దిందే ఆడవయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

డైరెక్టర్లుగా గుండ్రాంపల్లికి చెందిన కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ, అంతమ్మగూడెంకు చెందిన వస్పరి జహంగీర్, వేలిమినేడుకు చెందిన కొండె మహేష్, ఎల్లంబావికి చెందిన బాలం జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్ మాట్లాడుతూ సంఘ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

సభ్యుల సంక్షేమం, సంఘ బలోపేతం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

సంఘం నూతన కార్యవర్గానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధించి సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News