రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా సతీష్ గోపాతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్లగొండ సీసీఎస్లో విధులు నిర్వహించిన ఆయన, రామన్నపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్కు ప్రాధాన్యం ఇస్తూ, రామన్నపేటలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని ఎస్ ఐ సతీష్ గోపాతి పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి