విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానం చేసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలని యువ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బోరంచలో పుట్టి సాంకేతిక రంగంపై ఆసక్తితో కృషి చేశానన్నారు. తాను రూపొందించిన పంట పొలాల్లో రాళ్లు ఏరే ‘రుద్ర’ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన గ్రాస్రూట్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించామని తెలిపారు. ఆవిష్కరణ వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకుని అభినందించారని చెప్పారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టి దేశ కీర్తిని చాటాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు దీపక్ రెడ్డిని సన్మానించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి
Krishna
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానం చేసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలని యువ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బోరంచలో పుట్టి సాంకేతిక రంగంపై ఆసక్తితో కృషి చేశానన్నారు. తాను రూపొందించిన పంట పొలాల్లో రాళ్లు ఏరే ‘రుద్ర’ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన గ్రాస్రూట్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించామని తెలిపారు. ఆవిష్కరణ వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకుని అభినందించారని చెప్పారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టి దేశ కీర్తిని చాటాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు దీపక్ రెడ్డిని సన్మానించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి