Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 07:29 PM

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి
24-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానం చేసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలని యువ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బోరంచలో పుట్టి సాంకేతిక రంగంపై ఆసక్తితో కృషి చేశానన్నారు. తాను రూపొందించిన పంట పొలాల్లో రాళ్లు ఏరే ‘రుద్ర’ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించామని తెలిపారు. ఆవిష్కరణ వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకుని అభినందించారని చెప్పారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టి దేశ కీర్తిని చాటాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు దీపక్ రెడ్డిని సన్మానించారు.

Sthanikam

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలి – యువ శాస్త్రవేత్త దీపక్ రెడ్డి

Article Image

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానం చేసి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాలని యువ శాస్త్రవేత్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బోరంచలో పుట్టి సాంకేతిక రంగంపై ఆసక్తితో కృషి చేశానన్నారు. తాను రూపొందించిన పంట పొలాల్లో రాళ్లు ఏరే ‘రుద్ర’ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించామని తెలిపారు. ఆవిష్కరణ వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకుని అభినందించారని చెప్పారు. విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టి దేశ కీర్తిని చాటాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు దీపక్ రెడ్డిని సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News