తెలంగాణ రాష్ట్రంలో ఏకైకసూర్యదేవాలయంగా భక్తులకు దర్శనం ఇస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంతిమ్మాపురం గ్రామంలో జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రావణం ఏకాదశి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా నుండి కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చారు 12 గంటలకు అభిషేకం అలంకరణ అర్చన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకు లు కాకులారపు జనార్ధన్ రజిత రెడ్డి, గణపురం నరేష్ ,ఇంద్రారెడ్డి అర్చకులు, భీమ్ పాండే అంకిత్ పాండే, మహిళా భక్తులు, పులిచెర్ల ధనలక్ష్మి నరహరి యాదవ్, మాద రాములమ్మ, లింగంపల్లి నాగమ్మ, పులిచెర్ల వినోద, కనుకు రేణుక, కనుకునరసయ్య ,ముదిరాజ్ పాల్గొన్నారు














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి