భూవివాదం కేసులో రూ.75 వేల డిమాండ్.. ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన సిబ్బంది.
హైదరాబాద్: భూవివాదం కేసులో రూ.75 వేల లంచం డిమాండ్ చేసిన చందానగర్ ఎస్ఐ బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ రాజ్కుమార్, స్టేషన్ రైటర్ రాఘవను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చందానగర్ పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఎస్ఐ బాలరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. భూవివాదం కేసులో లంచం డిమాండ్ చేసిన వ్యవహారంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి