రామన్నపేట
మూసీ పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మూసీ నీటికి బదులుగా గోదావరి జలాలను అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం చేపట్టనున్న సీపీఎం జిల్లా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు బోయిని ఆనంద్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, నాయకులు బండ జగన్మోహన్రెడ్డి, నేమనంది లింగయ్య, బోయిని మల్లేష్, గోగు లింగస్వామి, బోయిని రామచంద్రం, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి