సమాజ సేవకులు, శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్ జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని సేవాసమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు, మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం సేవాసమితిలో నూతనంగా సభ్యులుగా చేరిన వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ.. మహంకాళి ప్రణీత్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. శ్రీ వాసవి సేవాసమితి ఎల్లప్పుడూ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సభ్యుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బజ్జూరి శ్రీనివాసు, సభ్యులు శ్రీరంగం రాము, పోలా లక్ష్మీనారాయణ, బుక్క రమేష్, తాటిశెట్టి హనుమంత్, మహంకాళి సోమయ్య, తల్లాడ కృష్ణమూర్తి, దేవరశెట్టి దుర్గాప్రసాద్, చందా రాజశేఖర్, శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి