Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:55 PM

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.
23-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహేశ్వరం: మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు, ఈ అంశంపై సమర్థవంతమైన వార్తా కథనాలు అందించేందుకు విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 25న మహేశ్వరంలో మీడియా వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, డ్రగ్స్‌ వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాలు, ఈ అంశంపై వచ్చే వార్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. మహేశ్వరం జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి మాదక ద్రవ్యాల ప్రభావంపై వివరించనున్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ పరిస్థితిపై ‘ఈగల్‌ బృందం’ అధికారి అవగాహన కల్పిస్తారు.

వర్క్‌షాప్‌కు స్థానిక విలేకరులందరూ హాజరు కావాలని పీఐబీ హైదరాబాద్‌ కోరింది. వివరాలకు మీడియా కమ్యూనికేషన్‌ అధికారి వి.గాయత్రి (9052565123)ను సంప్రదించవచ్చు.

Sthanikam

మాదక ద్రవ్యాలపై మీడియా అవగాహన.

Article Image

మహేశ్వరం: మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు, ఈ అంశంపై సమర్థవంతమైన వార్తా కథనాలు అందించేందుకు విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 25న మహేశ్వరంలో మీడియా వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, డ్రగ్స్‌ వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాలు, ఈ అంశంపై వచ్చే వార్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. మహేశ్వరం జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి మాదక ద్రవ్యాల ప్రభావంపై వివరించనున్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ పరిస్థితిపై ‘ఈగల్‌ బృందం’ అధికారి అవగాహన కల్పిస్తారు.

వర్క్‌షాప్‌కు స్థానిక విలేకరులందరూ హాజరు కావాలని పీఐబీ హైదరాబాద్‌ కోరింది. వివరాలకు మీడియా కమ్యూనికేషన్‌ అధికారి వి.గాయత్రి (9052565123)ను సంప్రదించవచ్చు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News