మహేశ్వరం: మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు, ఈ అంశంపై సమర్థవంతమైన వార్తా కథనాలు అందించేందుకు విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు 25న మహేశ్వరంలో మీడియా వర్క్షాప్ నిర్వహించనున్నారు.మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, డ్రగ్స్ వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాలు, ఈ అంశంపై వచ్చే వార్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. మహేశ్వరం జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి మాదక ద్రవ్యాల ప్రభావంపై వివరించనున్నారు. తెలంగాణలో డ్రగ్స్ పరిస్థితిపై ‘ఈగల్ బృందం’ అధికారి అవగాహన కల్పిస్తారు.
వర్క్షాప్కు స్థానిక విలేకరులందరూ హాజరు కావాలని పీఐబీ హైదరాబాద్ కోరింది. వివరాలకు మీడియా కమ్యూనికేషన్ అధికారి వి.గాయత్రి (9052565123)ను సంప్రదించవచ్చు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి