Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:11 PM

వర్షాల కోసం కప్పకాముడు

వర్షాల కోసం కప్పకాముడు

వర్షాల కోసం కప్పకాముడు
23-08-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ చిట్యాల మండలం నేరడ గ్రామపంచాయతీ పరిధిలోని సూదిరెడ్డిగూడెం గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా కప్పకాముడు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులతో కలిసి గ్రామస్థులు కప్పకాముడు ఆడుతూ, సంప్రదాయ పాటలు పాడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గతంలో ఈ సమయానికి విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకునేవని తెలిపారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేసినా నీరు పడని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను చూసి దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కప్పకాముడు నిర్వహించి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూది రెడ్డి వసంత, మెండే కేతమ్మ, ఈశ్వరమ్మ, జాల పద్మ, మంజుల, పద్మ, చిరబోయిన జయమ్మ, శోభ, సువర్ణ, పర్వతమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వర్షాల కోసం కప్పకాముడు

Article Image

చిట్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ చిట్యాల మండలం నేరడ గ్రామపంచాయతీ పరిధిలోని సూదిరెడ్డిగూడెం గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా కప్పకాముడు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులతో కలిసి గ్రామస్థులు కప్పకాముడు ఆడుతూ, సంప్రదాయ పాటలు పాడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గతంలో ఈ సమయానికి విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకునేవని తెలిపారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేసినా నీరు పడని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను చూసి దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కప్పకాముడు నిర్వహించి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూది రెడ్డి వసంత, మెండే కేతమ్మ, ఈశ్వరమ్మ, జాల పద్మ, మంజుల, పద్మ, చిరబోయిన జయమ్మ, శోభ, సువర్ణ, పర్వతమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News