నంబర్ ప్లేట్లు లేని 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
యజమానులతో అప్పటికప్పుడే వాహనాలకు నెంబర్ ప్లేట్స్ వేయించిన పోలీస్
సూర్యాపేట, ఆగస్టు 22: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు (స్పెషల్ డ్రైవ్) నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వాహన యజమానులతో అప్పటికప్పుడే వాహనాలకు నంబర్ ప్లేట్లు వేయించి, నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. అనంతరం పట్టుబడిన వాహనదారులకు ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ"వాహనదారులు, పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వాహనానికి నంబర్ ప్లేట్ లేకపోతే ఏదైనా ప్రమాదం లేదా నేరం జరిగినప్పుడు వాహనాన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి