Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 09:54 PM

నోటీసులు ఇవ్వకుండా సర్వే.. ఆర్‌డీఓకు ఫిర్యాదు

నోటీసులు ఇవ్వకుండా సర్వే.. ఆర్‌డీఓకు ఫిర్యాదు

నోటీసులు ఇవ్వకుండా సర్వే.. ఆర్‌డీఓకు ఫిర్యాదు
22-08-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రైవేట్ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

బాధితులకు ముందస్తు ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండా, ప్రైవేట్ వ్యక్తితో దౌర్జన్యంగా భూ సర్వే నిర్వహించిన సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పరిధిలోని తంగడపల్లికి చెందిన మైలారం రాఘవేంద్ర శనివారం ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు.

​బాధితుడి కథనం ప్రకారం.. తంగడపల్లి గ్రామ శివారులో మైలారం నరసింహ, పద్మలకు ఆరెకరాల భూమి ఉంది. వారి భూమికి ఆనుకుని ఉన్న మాదిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పొల పొరుగు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండానే వెంకటరమణ అనే ప్రైవేట్ వ్యక్తి తాను ‘అసిస్టెంట్ సర్వేయర్‌’నని చెప్పుకుంటూ శనివారం పొలం వద్దకు వచ్చి హద్దురాళ్లు పాటేందుకు ప్రయత్నించారు. సమాచారం లేకుండా సర్వే చేయడంపై బాధిత రైతు ప్రశ్నించగా, ఆయనను దౌర్జన్యంగా పక్కకు నెట్టివేసి హద్దులు నాటారు.

​సమాచారం అందుకున్న రైతు కుమారుడు రాఘవేంద్ర అక్కడికి చేరుకుని అనుమతి పత్రాలు చూపించాలని నిలదీయడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అధికారులు వెంటనే స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్‌డీఓను వేడుకున్నారు.

Sthanikam

నోటీసులు ఇవ్వకుండా సర్వే.. ఆర్‌డీఓకు ఫిర్యాదు

Article Image

ప్రైవేట్ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

బాధితులకు ముందస్తు ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండా, ప్రైవేట్ వ్యక్తితో దౌర్జన్యంగా భూ సర్వే నిర్వహించిన సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పరిధిలోని తంగడపల్లికి చెందిన మైలారం రాఘవేంద్ర శనివారం ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు.

​బాధితుడి కథనం ప్రకారం.. తంగడపల్లి గ్రామ శివారులో మైలారం నరసింహ, పద్మలకు ఆరెకరాల భూమి ఉంది. వారి భూమికి ఆనుకుని ఉన్న మాదిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పొల పొరుగు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండానే వెంకటరమణ అనే ప్రైవేట్ వ్యక్తి తాను ‘అసిస్టెంట్ సర్వేయర్‌’నని చెప్పుకుంటూ శనివారం పొలం వద్దకు వచ్చి హద్దురాళ్లు పాటేందుకు ప్రయత్నించారు. సమాచారం లేకుండా సర్వే చేయడంపై బాధిత రైతు ప్రశ్నించగా, ఆయనను దౌర్జన్యంగా పక్కకు నెట్టివేసి హద్దులు నాటారు.

​సమాచారం అందుకున్న రైతు కుమారుడు రాఘవేంద్ర అక్కడికి చేరుకుని అనుమతి పత్రాలు చూపించాలని నిలదీయడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అధికారులు వెంటనే స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్‌డీఓను వేడుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News